కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారు : కోమటిరెడ్డి

SMTV Desk 2018-04-18 16:26:35  mla komati reddy, komatireddy comments on kcr,

హైదరాబాద్, ఏప్రిల్ 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రామయ్య దర్శనం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనాడు దళితులకే ముఖ్యమంత్రి పదవి కట్టబెడతానని చెప్పి తానే గద్దెనేక్కారని ఆరోపించారు. అంతేకాకుండా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. చివరకు ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను బహిష్కరించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన క్రమంలో కేంద్రంలో మోదీ, ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో.. అమాయక దళితులు పది మంది ఘర్షణల్లో మృతి చెందారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంతకు కేసీఆర్ దళితులను ఏం చేయాలనుకుంటున్నారు.? అంటూ ప్రశ్నించారు. అనైతిక చర్యలకు పాల్పడి మానసికంగా తనను ఇబ్బందుల పాలు చేసినందుకు ప్రజలే తగిన గుణపాటం చెబుతారని చెప్పుకొచ్చారు.