భర్త వేధింపులే కారణం....

SMTV Desk 2017-07-04 13:11:35  Suicide, neerajareddy, suchinreddy, lover, couple, feabravary, ramagundam,Husband abuse

హైదరాబాద్, జూలై 4 : వైవివాహిత జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నఉన్నత కుటుంబానికి చెందిన యువతి. కాబోయే భర్తను ఎంతో ఉన్నతంగా ఊహించుకుంది. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం చేసుకుంది. ఆ తరువాత మెల్ల మెల్లగా భర్త బండారం తెలియడంతో గాల్లో మేడలు కట్టాడని ఆ భాదను ఆమె దిగమింగుతూ మర్చుకుందాం అనుకుంది. కానీ అతను అప్పటికే ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది. తాజాగా భర్తకు ఆమె ద్వారా ఓ కుమారై పుట్టిందని తెలిసి ఇక తట్టుకోలేకపోయింది. తీవ్ర మానసిక ఒత్తిడితో వివాహమైన అయిదు నెలలకే బలన్మరణానికి పాల్పడింది. జీడిమెట్ల ఎస్సై సుమన్ చెప్పిన విషయం ప్రకారం... రామగుండం నివాసులు విష్ణువర్ధన్, లక్ష్మి దంపతుల కుమారుడు సుచిన్ రెడ్డి(27),బెంగళూరులో వ్యాపారం ఉందని పెళ్లి సమయంలో చెప్పాడు. టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన సత్తిరెడ్డి, అరుణ దంపతుల కుమారై నీరజారెడ్డి(25) బీఫార్మసీ చేసింది ఆమెకి సుచిన్ తో ఫిబ్రవరి 16, 2017లో 40 లక్షలు కట్నంగా ఇచ్చి వివాహం చేశారు. వివాహ అనంతరం అతను భార్యతో కలిసి మకాం మార్చి ఏ పని చేయకుండా కట్నం డబ్బులతోనే కాలం గడుపుతూ ఓ యువతితో ప్రేమాయణం వివాహం ముందు నుంచే నడిపస్తున్నాడు. తరచుగా ఆమెతో చరవాణిలో సంభాషిస్తుంటే గమనించిన భార్య నిలదియడంతో వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇకనైన ఇలాంటివి మానుకోవాలని కోరిన భార్యపై అతను పెడచెవిన పెట్టాడు. ఇంతలోనే ఆ యువతికి కుమారై పుట్టినట్లు తెలియటంతో తీవ్ర మనస్తాపం చెంది నీరజారెడ్డి రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. భర్త వేధింపుల కారణంగానే తన కుమారై ఆత్మహత్యకు పాల్పడిందని జీడిమెట్ల పోలీసులకు సత్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు సుచిన్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.