దుబాయ్, ఏప్రిల్ 13 : టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన కెరీర్లోనే అత్యున్నత ర్యాంకును సాధించింది. ఐసీసీ తాజాగా వన్డే మహిళా క్రికెట్ ర్యాంకులను వెల్లడించింది. ఇందులో భారత స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ విభాగంలో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో స్మృతి మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. 181 పరుగులు సాధించిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును దక్కించుకుంది. ఈ సిరీస్లో చేసిన ప్రదర్శనకుగానూ స్మృతి(678) తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. బ్యాటింగ్ విభాగంలో పెర్నీ(744, ఆస్ట్రేలియా), బాట్స్(696, న్యూజిలాండ్), మెగ్ లానింగ్(684, ఆస్ట్రేలియా) టాప్-3లో చోటు దక్కించుకున్నారు. భారత జట్టు సారథి మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్.. 7, 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల విషయానికొస్తే జులన్ గోస్వామి తన ర్యాంకును మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచింది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ మూడో ర్యాంకును దక్కించుకొంది.