ఆ ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచాయి : రోహిత్ శర్మ

SMTV Desk 2018-04-13 17:21:22  rohith sharma, mumbai indians, ipl, chennai super kings

హైదరాబాద్, ఏప్రిల్ 13 ‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 టోర్నీ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ముఖ్యంగా గెలవాల్సిన ఆ రెండు మ్యాచ్ లు చివరిలో ముంబై చేతులేత్తిసింది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ సారథి స్పందిస్తూ.. ప్రధానంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపు దగ్గరగా వచ్చి పరాజయం చెందడాన్ని జీర్ణించుకోవడం చాలా కఠినంగా ఉందన్నాడు. ఈ క‍్రమంలోనే తమ బ్యాటింగ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్‌.. కనీసం పోరాడే స్కోరును ఉంచలేకపోయామన్నాడు. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌వికెట్‌ తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతికి సన్‌రైజర్స్‌ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నైపై ముంబై చేతిలో ఓటమి పాలయ్యింది. "వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మమ్మల్ని గెలుపు ఊరించినట్లే ఊరించి దూరమైంది. ఇది చాలా నిరాశపరిచింది. మేము మంచి స్కోరు సాధించలేకపోయాం. దాంతోనే పోరాడి ఓడిపోయాం. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేది. మా బ్యాట్స్‌మెన్‌ ఇంకా బాగా ఆడాల్సింది. బ్యాట్స్‌మెన్‌ వైఫల‍్యమే మా కొంప ముంచింది. ఇక బౌలర్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. పరాజయం బాధపెట్టిన.. యువ క్రికెటర్లు ఆకట్టుకున్న తీరు బాగుంది" అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.