హైదరాబాద్, ఏప్రిల్ 12 : ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ కు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7న ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన మ్యాచ్ గెలుపు అంచులు దాకా వెళ్లిన ముంబై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేసే సమయంలో మైదానంలో కిందపడి విలవిల్లాడిపోయాడు. దీంతో అతడు బౌలింగ్ పూర్తి చేసి ఫీల్డింగ్కు దూరమయ్యాడు. ఈ రోజు ఉప్పల్ మైదానంలో ముంబయి ఇండియన్స్ పాల్గొన్న ప్రాక్టీస్ సెషన్స్కి హార్దిక్ హాజరుకాలేదు. దీంతో సన్రైజర్స్తో జరిగే మ్యాచ్కు హార్దిక్ దూరం కానున్నాడని సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఈ రోజు మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో పాండ్య వైదొలిగితే ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే. మరో వైపు ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించిన సన్రైజర్స్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.