హైదరాబాద్, ఏప్రిల్ 12 : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనాల సునామి శ్రీరెడ్డి.. రోజుకో వార్తతో ప్రత్యక్షమవుతోంది. తనకు న్యాయం చేయాల్సిందే అంటూ భీష్మించుకొని కూర్చుంది. తాజాగా కోన వెంకట్ పై సంచలన ఆరోపణలు చేసింది. వెంకట్ తనతో అసభ్యంగా చాటింగ్ చేసేవారంటూ మెసేజ్ల స్క్రీన్ షాట్లు పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కోనవెంకట్.. శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ వేదికగా.. "ఓ నటి కొందరు సినిమా వాళ్లతో పాటు నా పేరు మీద కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసి షాక్ తిన్నాను. ఈ విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. నిజం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను" అని వెంకట్ ట్వీట్ చేశారు.
I’m shocked with some allegations made by one actress against some film personalities including me.. I demand the government to conduct through police investigation in these allegations and punish whoever are guilty.. Truth must prevail legal action follows!!
— kona venkat (@konavenkat99) April 11, 2018