హైదరాబాద్, ఏప్రిల్ 11 : టాలీవుడ్లో రోజుకో సంచలనం సృష్టిస్తూ.. తనకు జరిగిన అన్యాయంపై రోజుకో ఫోటోను విడుదల చేస్తుంది శ్రీరెడ్డి. తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా కోన వెంకట్ పై సంచలన ఆరోపణలు చేసింది. వెంకట్ తనతో అసభ్యంగా చాటింగ్ చేసేవారంటూ మెసేజ్ల స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు. తనను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనకాల ఒక గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడని.. వి.వి.వినాయక్ కూడా ఇక్కడికి వస్తారంటూ చెప్పినట్లు తెలిపింది. అక్కడికి వెళ్ళాక.. తనను శారీరకంగా బలవంతం చేశాడ౦టూ అవన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తానంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. చాలా మంది ఆధారాల్లేకుండా మాట్లాడొద్ద౦టున్నారని.. ఆ ఆధారాలు చూపిస్తే ఎవరు జీర్ణించుకోలేరు అంటూ వెల్లడించింది. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.