తొలి విజయం నమోదు చేసిన ఆర్ఆర్..

SMTV Desk 2018-04-12 11:06:16  rajastan royals, ipl, delhi dare devils, sanju samsan

జైపూర్, ఏప్రిల్ 12 : ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు తొలి విజయం నమోదు చేసింది. జైపూర్ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అంతకుముందు ఆర్ఆర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రహానే ( 45) రాణించగా, సంజు శామ్సన్‌ (37), జాస్‌ బట్లర్‌ ( 29) బ్యాఝులిపించలేకపోయారు ఈ దశలో వరుణుడు అంతరాయం కల్పించడంతో 17.5 ఓవర్ల దగ్గర మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికే రాజస్థాన్ స్కోర్ 153/5. అనంతరం ఆలస్యంగా మొదలైన మ్యాచ్ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం డేర్‌ డెవిల్స్‌ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా నిర్దేశించారు. ఢిల్లీ జట్టులో విధ్వంసక ఓపెనర్‌ మున్రో (0) తొలి బంతికే రనౌట్‌కాగా , మ్యాక్స్‌వెల్‌ (17), రిషభ్‌ పంత్‌ (20) ధాటిగా ఆడలేదు. దీంతో గంభీర్ జట్టు ఆరు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసి పరాజయం పాలైంది. ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు ను సంజు శాంసన్‌ దక్కించుకున్నాడు.