అందుకే డ్రెస్సింగ్ రూమ్ లో ఉండిపోయా : మిస్టర్ కూల్

SMTV Desk 2018-04-11 17:01:30  chennai super kings, ms dhoni, kolkatha knight riders, chennai

చెన్నై, ఏప్రిల్ 11 : మహేంద్రసింగ్ ధోని తన నాయకత్వంతో ఐపీఎల్ లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతని సారథ్యంలో రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఎంత ఒత్తడి వచ్చిన ఈ మిస్టర్ కూల్ ముఖంలో ఆందోళనే కనిపించదు. అయితే నిన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ -కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఎవరు గెలుస్తారో అని ఆత్రుతగా చూశారు. వీక్షించే వారికే టెన్షన్ అయితే మరి ఆడే వారి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ మ్యాచ్ లో ధోని కూడా ఆందోళనకు గురయ్యాడట. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా చెప్పాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై చివరి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బిల్లింగ్స్‌ తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. కోల్‌కతా చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. ఇరు జట్ల బౌలర్లకు ఈ మ్యాచ్‌ చాలా కఠినంగా సాగింది. విజయం కోసం చివరి ఓవర్లో మా జట్టు 17 పరుగులు చేయాలి. ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురయ్యా. నా పల్స్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది. అందుకే డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఉండిపోయాను. ఒకవేళ ఆ సమయంలో డగౌట్‌లో ఉంటే నా ఎమెషన్స్‌ గురించే వ్యాఖ్యాతలు మాట్లాడుకునేవారు. అందుకే బయటకు రాలేదు. నా భావాలను డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ప్రదర్శించగలను.. డగౌట్‌లో కాదు’ అని ధోనీ వెల్లడించాడు.