అత్యధిక స్క్రీన్లపై నాని "కృష్ణార్జున యుద్ధం"

SMTV Desk 2018-04-11 16:07:41  krishnaarjuna yuddam, hero nani, nani movie record release

హైదరాబాద్, ఏప్రిల్ 11 : నాని కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "కృష్ణార్జున యుద్ధం". నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ కథానాయికలుగా నటించారు. అయితే ఈ చిత్రాన్ని యూఎస్ లో రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్లపై విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం 600 స్క్రీన్లపై అక్కడ సినిమాను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇలా యూఎస్ లో నాని సినిమాను రికార్డు స్థాయిలో రిలీజ్ చేయడం తొలిసారి. అమెరికాలో నేడు "కృష్ణార్జున యుద్ధం" సినిమా ప్రీమియర్‌ షోలను నిర్వహించనున్నారు. ఈ సినిమాకు హిప్‌హాప్‌ తమిళ సంగీత దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.