మహబూబ్నగర్, ఏప్రిల్ 11: పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్మాస్టర్పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లి పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ దాడిలో హెడ్మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం.