వృద్ధుడు మృతి నాలుగు లారీలు దహనం

SMTV Desk 2017-07-03 14:06:40  four, loory, fire

సిరిసిల్ల, జులై 03 : సిరిసిల్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందడంతో నాలుగు లారీలను దహనం చేసిన ఘటన తుంగపల్లి మండల శివారులో చోటు చేసుకుంది. సిరిసిల్ల నేరేళ్లకు చెందిన బసవపురం భూమయ్య (60) క్రాసింగ్ నుంచి నేరేళ్లకు వెళ్తున్నాడు. జిల్లేల శివారులో ఇసుక లారీ భూమయ్యను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భూమయ్య మృతి చెందటం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల - సిద్ది పేట రోడ్డుపై బైఠాయించారు. అడ్డు వచ్చిన పోలీసులను తోసి పుచ్చి అక్కడే ఉన్న నాలుగు లారీలకు నిప్పంటించారు. అందులో రెండు లారీలు పూర్తిగా కాలిపోగా మరో రెండు పాక్షికంగా దహనం అయ్యాయి.