హైదరాబాద్, ఎప్రియిల్ 10: టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంపై పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటు గా స్పందించారు. కోదండరాం లాంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి అవసరం లేదని పరుష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోదండరాం కొత్త దుకాణం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి కుట్రలను టీఆర్ఎస్వీ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.