ముంబై, ఏప్రిల్ 10 : ఈ మధ్య కాలంలో దర్శకనిర్మాతలు ఎక్కువగా చరిత్రకి సంబంధించిన సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో "మహాభారతం" సినిమాను తానూ ఐదు భాగాలుగా అందించాలనుకుంటున్నట్లు గతంలో అమీర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి భాగాన్ని భారీ బడ్జెట్ తో రూపుదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా.. తానూ శ్రీకృష్ణుడిగా గాని, కర్ణుడిగా గాని నటిస్తానని ప్రకటించారు. దీంతో పలువురు మహాభారతంలో అమీర్ నటించడమేంటి.? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారట. ఈ ఘటనతో అమీర్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన కొన్ని చారిత్రక చిత్రాలు ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తన ఆలోచనను విరమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.