ఈ ఐపీఎల్ కు ఆ జట్టు సారథి.. ప్రత్యేకం..!

SMTV Desk 2018-04-10 15:56:44  ipl-11 season, ravichandran ashwin, kings X1 punjab, sun risers hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 10 : ఐపీఎల్ హడావిడి మొదలై నాలుగు రోజులు అవుతుంది. ఇప్పటికే ఎనిమిది జట్లు చెరో మ్యాచ్ అడేశాయి. అయితే ఈ సీజన్ లో కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌కు నాయకత్వం వహిస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే..మిగతా జట్ల సారథులు ఎంఎస్‌ధోని(చెన్నై సూపర్‌ కింగ్స్‌), విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌), రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌), కేన్‌ విలియమ్సన్‌ (సన్‌రైజర్స్‌), అజింక్యా రహానే (రాజస్తాన్‌), గౌతం గంభీర్‌ (ఢిల్లీడేర్‌ డేవిల్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) వీరందరూ బ్యాట్స్ మెన్‌లు. కానీ అశ్విన్‌ ఒక్కడే బౌలర్‌ కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్లో ఒక్క విలియమ్సన్‌ తప్ప మిగతా నాయకులూ అందరూ భారత్ ఆటగాళ్లు కావడం మరో విశేషం. అశ్విన్‌ కెప్టెన్సీలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ పై తొలి మ్యాచ్ లో నెగ్గి ఈ సీజన్ ను ఘనంగా చాటుకుంది. గతంలో రైజింగ్‌ పుణె, చెన్నైసూపర్‌ కింగ్స్‌ల తరుపున ఆడిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ను పంజాబ్‌ ఈసీజన్‌లో అనూహ్యంగా కెప్టెన్ గా చేసింది. దశాబ్ద కాలంగా ట్రోఫీ నెగ్గని పంజాబ్‌ ఈ సారి అశ్విన్ సారథ్యంలోనైన కప్ ను సాధిస్తుందో లేదో చూడాలి.