కామన్వెల్త్‌ గేమ్స్ : స్వర్ణం సాధించిన హీనా సిద్దూ

SMTV Desk 2018-04-10 14:53:52  Commonwealth Games 2018, heena sidhu, gold coast, gagan narang

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 10: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆరో రోజు మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు స్వర్ణం సాధించింది. 38 పాయింట్లతో సరికొత్త రికార్డు నమోదు చేయడంతో హీనాకు బంగారుపతకం ఖాయమైంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో హీనాకు ఇది రెండో పతకం. ఇంతకుముందు మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో హీనా రజతం గెలుచుకొంది. అంతకుముందు పురుషుల 50మీటర్ల రైఫిల్‌ విభాగంలో స్వర్ణం దక్కుతుందని అనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. గగన్‌ నారంగ్‌, చైన్‌ సింగ్‌ పతకాలు గెలవడంతో విఫలమయ్యారు. ఇప్పటి వరకూ వరకు భారత్‌ మొత్తం 20(11 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు) దక్కించుకొంది. ప్రస్తుతం భారత్‌ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతుంది.