ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల పంజా

SMTV Desk 2018-04-09 17:50:25   Two jawans killed in IED blast, chhattisgarh

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 9: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కుత్రు వద్ద మావోయిస్టులకు, సీఆర్‌పీఎఫ్ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఇంప్రోవైస్డ్ ఎక్స్ప్లోసివవ్ డివైస్( ఐఈడీ) పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు స్పెషల్ డీజీ తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.