జమ్మూ కశ్మీర్‌లో భూకంపం

SMTV Desk 2018-04-09 16:42:40  Earthquake, Jammu Kashmir, Amritsar

శ్రీనగర్‌, ఏప్రిల్ 9: జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించలేదు. రిక్టర్‌ స్కేలు పై భూకంప తీవ్రత 4.0 గా నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ అధికారంగా వెల్లడించింది. సోమవారం ఉదయం 6.06 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అలాగే భూకంప కేంద్రం పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ జిల్లా కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.