రాహుల్‌ గాంధీ నిరాహార దీక్ష

SMTV Desk 2018-04-09 16:08:35   Rahul Gandhi, rajgha tHunger Strike

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: బీజేపీ సర్కారు పనితీరును వ్యతిరేఖిస్తూ దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. రాజ్‌భవన్‌లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌‌ ఖర్గే, షీలా దీక్షిత్‌, అశోక్‌ గెహ్లట్‌‌, అజయ్‌ మాకెన్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు తమ రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో నిరసన నిరాహార దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాయి.