చెన్నై, ఏప్రిల్ 9 : రెండేళ్ల పునరాగమనం తర్వాత ఐపీఎల్ బరిలోకి దిగిన చెన్నై జట్టులో ఏ మాత్రం సత్తా తగ్గలేదని ఆరంభ మ్యాచ్ లో రుజువైంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో డ్వేన్ బ్రేవో సునామీ ఇన్నింగ్స్ తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్ గాయం కారణంగా బ్యాటింగ్ కొనసాగించలేక మధ్యలోనే వెళ్లిపోయాడు. అయితే చివరిలో బ్రేవో ఔటైన తర్వాత కేదార్ జాదవ్ లా౦ఛానాన్ని పూర్తి చేశాడు. తాజాగా చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఆడుతోన్న కేదార్ జాదవ్ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. తొడ కండరాలు గాయంతో బాధపడుతోన్న కేదార్ జాదవ్కు వైద్యుల సూచన మేరకు పలు స్కానింగ్లు నిర్వహించారు. దీంతో అతను కోలుకోవడానికి కొద్ది సమయం పట్టేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై తన సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.