ఐపీఎల్ లో తండ్రీ కూతుళ్ళు సందడి

SMTV Desk 2018-04-09 15:48:09  IPL Mach,Shah Rukh Khan, Sunayana.

ముంబై, ఏప్రిల్ 9 : ఇండియాలో ఐపీఎల్ పండుగ సందడి మొదలైంది. క్రికెట్ అభిమానులు మ్యాచ్ ను తిలకించడానికి ఎక్కువగా ఆసక్తి చుపుతుంటారు. అదే తరహలో సినీ తారలు కూడా మెరిసి మ్యాచ్ లో సందడి చేస్తుంటారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మూడవ మ్యాచ్ లో షారుఖ్ తన టీమ్ కు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. అలాగే ఆయన కూతురు సుహానా కూడా వచ్చి ఆ టీమ్ కు సపోర్ట్ చేసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగులూర్ తో ఆడింది. మొదట విరాట్ సేన షారుక్ టీమ్ ను ఓడించే దిశగా సాగినప్పటికి.. షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానాలు టీమ్ లో నింపిన ఉత్తేజంతో.. ఫైనల్ గా దినేష్ కార్తిక్ కెప్టెన్సీ లో కేకేఆర్ ఈ సీజన్ ను గెలుపుతో ప్రారంభించింది.