అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి

SMTV Desk 2018-04-09 15:00:57  Shoes factory Fire accident, short circuit, Delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఢిల్లీలోని బూట్ల ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన సుల్తాన్‌పురి రాజా పార్క్‌ ఫ్యాక్టరీలో ఉదయం 6.35 గంటలకు జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 12 మంది కార్మికులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖాదికారి పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో నలుగురు కార్మికులు మృతి చెందారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.