కోల్కతా, ఏప్రిల్ 9: కోల్కతాలోని ధం ధం కంటోన్మెంట్ ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానిక రైల్వే లైన్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో 10 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క సారిగా బాంబు పేలడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా బాంబు పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.