జీఎస్ టీ ని ఎత్తుకున్న తల్లి

SMTV Desk 2017-07-02 15:47:45  gst, bill, child, name, is, gst

బీవర్, జూలై 02 : దేశంలో శుక్రవారం అర్థ రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో జీఎస్ టీ బిల్లును ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే రాజస్థాన్ బీవర్ లో ఓ తల్లి తన బిడ్డకు జీఎస్ టీ అని పేరు పెట్టుకుంది. రాజస్థాన్ బీవర్ లో ఆసుపత్రిలో జూలై 1 అర్దరాత్రి 12,02 నిమిషాలకు ఆ తల్లి పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ పాప జన్మించిన రోజు నుంచి జీఎస్ టీ అమలు అవుతుండటంతో ఆ తల్లి పాపకు జీఎస్ టీ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ పాపను ఎత్తుకొని సెల్ఫి కూడా దిగారు.