తెదేపా ఎంపీల శాంతియుత నిరసన

SMTV Desk 2018-04-09 12:06:30   TDP MPs Protest At Rajghat, For AP Special Status

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన తీవ్రం చేశారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ పోరాడుతామని స్పష్టం చేశారు.