ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ సాధించాడు. ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. 2014లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ ఈ ఫీట్ సాధించగా, 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నరైన్.. పఠాన్ సరసన చేరాడు. దాన్ని తాజాగా రాహుల్ సవరించి కొత్త మైలురాయిని సాధించాడు.