అహ్మదాబాద్, ఏప్రిల్ 8: ఒడిశాలోని టిట్లాగఢ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో నిండిన అహ్మదాబాద్-పూరీ ఎక్స్ప్రెస్ ఇంజిన్ లేకుండానే ప్రయాణించింది. అయితే సిబ్బంది అప్రమత్త౦గా వ్యవహరించడంతో చివరకు రైలునుఆపగలిగారు. 22 బోగీలు ఇంజిన్ లేకుండా దాదాపు 10 కిలోమీటర్లు వరకు వెళ్లాయి. అయితే స్కిడ్ బ్రేక్స్ వేయకపోవడంతో ఇంజిన్ లేకుండానే రైలు పరుగులు తీసిందన్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ గాయాలవలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సంభల్పూర్ రైల్వే డివిజన్లోని కేసింగ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిందని, సుమారు 10 కి.మీ. ప్రయాణించిందని తెలిపారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని, రైలును సురక్షితంగా ఆపగలిగామని వివరించారు. బ్రేకులు సక్రమంగా వేయడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.