విశాఖలో అల్లు అర్జున్ సైకత శిల్పం..

SMTV Desk 2018-04-07 19:15:40  ALLU AJUN, BIRTHDAY GIFT, SAND ART IN VISHAKHA.

విశాఖ, ఏప్రిల్ 7 : విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అభిమానులు.. అతనికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఏకంగా అల్లు అర్జున్ కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. అది 5 అడుగుల ఎత్తు.. 30 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దిన భారీ సైకత శిల్పం. ఈ శిల్పాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సైకత శిల్పి మానస్‌ శేషు తీర్చిదిద్దారు. ఈ అవార్డును అల్లు అభిమానులు ఇస్తున్న కానుక అంటూ మానస్ తెలిపారు. విశాఖ బీచ్ లో ఈ శిల్పం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వ‌క్కతం వంశీ దర్శకత్వంలో "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" చిత్రంలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఈ సినిమా మే 4న విడుదల కానుంది.