కామన్వెల్త్‌ గేమ్స్‌ : భారత్ కు మరో పసిడి పతకం

SMTV Desk 2018-04-07 17:52:11  COMMON WEALTH GAMES-2018, RAGALA VENKAT RAHUL, GOLDCOAST, INDIA

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 7: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ తెచ్చిన అన్ని పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనివే కాగా తాజాగా మరో పసిడి పతకం మన ఖాతాలోకి చేరింది. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ ల్లో భాగంగా మొత్తం 338 కేజీలను ఎత్తిన వెంకట్‌ రాహుల్‌ స్వర్ణంను గెలుచుకున్నాడు. రాహుల్‌ రాగల స్వర్ణం సాధించాడు. పురుషుల 85 కేజీల విభాగంలో తెలుగబ్బాయి రాగాల వెంకట రాహుల్‌ మొత్తం 338 కేజీలు ఎత్తి అగ్రస్థానంలోనిలిచాడు. రాహుల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు. 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు 4 స్వర్ణాలు, ఒక కాంస్యం, ఒక రజతం దక్కాయి. ఈ పోటీల్లో వెయిట్‌ లిఫ్టర్లు దీపక్‌ లాటెర్‌ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం), సతీశ్‌ కుమార్‌ శివలింగం (స్వర్ణం) పతకాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే.