రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్‌ విజయమ్మ!

SMTV Desk 2018-04-07 17:12:02  Special Category Status,YSRCP MPs Hunger Strikeys, vijayamma

హైదరాబాద్‌, ఏప్రిల్ 7: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పదవులను వదులుకొని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆమె రేపు (ఆదివారం) సందర్శించనున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి వైఎస్‌ విజయమ్మ పరామర్శించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఉన్నందువల్ల ఆయన ప్రతినిధిగా విజయమ్మ ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారు.