గోల్డ్కోస్ట్, ఏప్రిల్ 7 : కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా ఈ రోజు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పురుషుల హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. విజయం సాధిస్తుంది అనుకున్న భారత్ జట్టుకు చివరి క్షణంలో దాయాది దేశం షాక్ ఇచ్చింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 13వ నిమిషంలోనే భారత్ తరఫున దిల్ప్రీత్ సింగ్ మొదటి గోల్ నమోదు చేశాడు. తర్వాత 19వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ రెండో గోల్ కొట్టాడు. 38వ నిమిషంలో పాక్ ఆటగాడు మహమ్మద్ ఇర్ఫాన్ తొలి గోల్ చేయగా, మరో నిమిషంలో మ్యాచ్ అయిపోతుందనగా.. ఇక విజయం భారత్దే అనుకున్న వేళ.. పాక్ తరుపున ముబాషర్ అలీ గోల్ చేసి 2-2తో మ్యాచ్ను డ్రాగా ముగించి టీమిండియా ఆశలను ఆవిరిచేశాడు. పూల్-బిలో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా పాక్ మూడో స్థానంలో ఉంది.