స్నేహంతో పోల్చగలిగింది మరేదీ లేదు: నేపాల్ ప్రధాని న్యూఢిల్లీ, ఏప్రిల్ 7:భారత్తో మాకు స్నేహమే ముఖ్యమని స్నేహంతో పోల్చగలిగింది మరేదీ లేదు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ విచ్చేసిన ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు ఘనంగా ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్లో గౌరవ వందన స్వీకరించిన అనంతరం ఓలి రాష్ట్రపతి కోవింద్తో సమావేశమయ్యారు. భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలపై చర్చలు జరపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఓలి మాట్లాడుతూ..ఏ తీర్మానమైనా, ఒప్పందమైనా, మరేదైనా స్నేహంతోనే ప్రారంభమవుతుంది. మా పొరుగు దేశాలు ప్రత్యేకించి భారత్తో ముందుగా మేము స్నేహాన్నే కోరుకుంటున్నాం...’’ అని వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రపతితో చర్చల అనంతరం నేపాల్ ప్రధాని ఇవాళ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో సమావేశం కానున్నారు.