జోధ్పూర్, ఏప్రిల్ 7: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్పై సందిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా..జోధ్పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఇవాళ బెయిల్పై విచారణ జరగకపోతే రేపు ఆదివారం అయినందున ఈరోజు, రేపు కూడా జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.