హైదరాబాద్, ఏప్రిల్ 6 : తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తార కాజల్ అగర్వాల్. అగ్ర కథానాయకులతో ఆడిపాడి ఎన్నో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఒక సినిమాకు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకుంటోంది. తాజాగా కాజల్ వద్దకు ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు, కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకొని.. టైటిల్ రోల్ కి కాజల్ అయితే బాగుంటుందని అనుకున్నారట. అనుకున్నట్లుగానే కాజల్ ను కలిసి రూ.2కోట్లు ఆఫర్ చేశారట. కాని తానూ ఇప్పటివరకు కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలను తీయలేదని కాజల్ ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.