హైకోర్టులో ఏపీ న్యాయవాదులు ర్యాలీ

SMTV Desk 2018-04-06 16:07:12  high court, rally, lawyers, Andhra pradesh

హైదరాబాద్, ఏప్రిల్ 6‌: ప్రత్యక హోదా కోసం కొనసాగుతున్న నిరసనలో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో ఏపీ న్యాయవాదులు భారీ ర్యాలీ తీశారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు సంఘీభావంగా ర్యాలీ తీస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోదా వచ్చేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు