న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఐపీఎల్-11 సీజన్ రేపటి నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి సమరం ప్రారంభం ముందు దిల్లీ డేర్డేవిల్స్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ కగిసో రబాడ మొత్తం లీగ్ కు దూరమయ్యాడు. రబాడ వెన్నుముక కింది భాగంలో గాయంతో బాధపడుతున్న కారణంగా మూడు నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహమ్మద్ మూసాజీ తెలిపాడు. లీగ్ లో భాగంగా ఏప్రిల్ 7న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.