హైదరాబాద్, ఏప్రిల్ 5 : ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, సీనియర్ నటుడు చంద్రమౌళి తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెనికి చెందిన చంద్రమౌళి 1971లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుండి చాలా సినిమాలలో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 45ఏళ్ళ పాటు సినీరంగంలోనే ఉన్న ఈయన "అంతా మన మంచికే" అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. దాదాపు అగ్ర నటులు కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు వంటి నటులతో కలిసి నటించారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు.