తొలిసారిగా "మహానటి" కోసం సమ౦త..

SMTV Desk 2018-04-05 17:47:31  samantha, mahanati, samatha dubbing

హైదరాబాద్, ఏప్రిల్ 5 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా "మహానటి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా ఆమె భర్త జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ అన్వేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం సమంత తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పనున్నారు. తన ఎనిమిదేళ్ల సినీ ప్రపంచంలో ఇంతవరకు ప్రముఖ గాయని చిన్మయి తన పాత్రకు డబ్బింగ్ చెప్తూ వచ్చారు. ఇప్పడు ఈ "మహానటి" సినిమాలో మనం సమంత గొంతును వినే అవకాశం దక్కిందన్నమాట. ఈ చిత్రాన్ని మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల సమ౦త నటించిన "రంగస్థలం" చిత్రం ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్బులో చేరిపోయింది.