హైదరాబాద్, ఏప్రిల్ 4 : టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సినీ ప్రపంచం తెర వెనుక రహస్యాలను బయట పెడుతూ వస్తోంది. తాజాగా ఆమె ఫేస్బుక్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములను విమర్శిస్తూ ఆరోపణలు చేశారు. ఆయన్ను అవమానిస్తూ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తన ఫేస్బుక్ వేదికగా స్పందించారు. ఆమె చేసిన పోస్ట్లోని ప్రతి మాట అబద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ పోస్టులోని ప్రతి మాట తప్పని ఒప్పుకొని క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంపై శ్రీరెడ్డి ప్రతిస్పందించారు. నా ఫేస్బుక్ పేజీలో నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటానని వెల్లడించారు. ఏంటి శేఖర్ కమ్ముల.. సీరియస్ అయ్యారట. మీరు ఎవరైతే నాకేంటి.? నా ఫేస్బుక్ పేజీలో నేనేమైనా రాసుకుంటా. నేను మీ పేరు గాని, మీ సినిమా పేరు గాని ఎత్తలేదు కదా.! ఏంటి నన్ను జైల్లో పెట్టిస్తాన౦టునావ్ శేఖర్ కమ్ముల.? నీకు బాగా డబ్బులుంటే నాకేంటి.? నువ్వేవరైతే నాకేంటి.? ఫీల్ అవకండి. మీరేం చేయలేదుగా. అలాంటప్పుడు ఎందుకు.." అంటూ ఆమె ఫేస్బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు.