హైదరాబాద్, ఏప్రిల్ 4 : నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటించిన "ఛల్ మోహన రంగ" చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు నిర్మాతలు కావడంతో శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడిందట. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను జీ తెలుగు వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం జీ తెలుగు వారు 5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. కావున ఈ సినిమాకు ఇంత భారీ డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా తమన్ సంగీత దర్శకత్వం వహించారు.