ముంబై, ఏప్రిల్ 4 : మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్.. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు ఆరాధ్య తోనే ఎక్కువ సమయం గడుపుతానని పేర్కొన్నారు. ఇటీవల ఐష్ ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్కు ఫోటో షూట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. "చాలా మంది నాతో అంటుంటారు. ఆరాధ్యను చూసుకోవడానికి ఆర్మీలాంటి ఆయాలను నియమించుకోవాలని.. కాని ఆరాధ్యను చూసుకోవడానికి ఇంట్లో ఒక్క ఆయా మాత్రమే ఉంది. ఎందుకంటే సినిమాలతో, ఆరాధ్యతో నేను బిజీగా ఉండాలనుకుంటున్నాను. గృహిణులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారిని నేను ఎంతో గౌరవిస్తాను. బీ పాజిటివ్ అనేది ఒక బ్లడ్ గ్రూప్ మాత్రమే కాదు అది జీవితంలోను పాటించాలి. అదే ఆరాధ్యకు కూడా నేర్పిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.