టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం

SMTV Desk 2018-04-04 14:29:48   TRS MPs, take Oath, in Rajya Sabha

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: టీఆర్‌ఎస్‌ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌ రాజ్యసభలో తెలుగులో ప్రమాణ౦ చేశారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎస్పీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన జయా బచ్చన్‌ హిందీలో ప్రమాణం చేశారు. ఈ సమయంలో రాజ్యసభలో సభాపతిగా వెంకయ్యనాయుడు ఉన్నారు. ప్రమాణం స్వీకరించిన సభ్యులకు తోటి సభ్యులు పెద్దల సభలోకి ఆహ్వానం పలికారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకొంది. కేసీఆర్‌ మేనల్లుడు సంతోష్‌కుమార్‌ ఈసారి రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయంగా వెలుగులోకి వచ్చారు.