బెంగళూరు, ఏప్రిల్ 4 : ఐపీఎల్-11 మెగా టోర్నీ కు ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ధనా ధన్ సమరం కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ప్రాక్టీస్తో బిజీగా గడుపుతున్నారు. మరో పక్క ఆయా జట్ల ఫ్రాంఛైజీల ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తమ జట్టు ఆటగాళ్లతో కలిసి ఓ ప్రోమో సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కోహ్లీ, చాహల్, బ్రెండన్ మెకల్లమ్తో స్టెప్పులేయించింది. మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో చాహల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. చాహల్ను చూసిన కోహ్లీ కూడా ఒక్కసారిగా నవ్వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చాహల్ తన ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘ఐపీఎల్ కోసం దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, మెకల్లమ్తో వార్మప్ చేస్తున్నాను’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో ఫుల్ వైరల్ గా మారింది. ఏప్రిల్ 7న ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.