వచ్చే ఎన్నికల్లో మోదీకి బుద్ధి చెప్పాలి: రాహుల్‌

SMTV Desk 2018-04-04 11:03:15   Rahul gandhi, commented over modi

బళ్లారి, ఏప్రిల్ 4: ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. వేల కోట్లు లూటీ చేసిన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మోదీ హయాంలో దేశంలో అవినీతి తాండవిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో రాహుల్‌ పర్యటించారు. ‘అబద్ధాలు ఎన్నో రోజులు సాగవు. మోదీ అధికారంలోకి వస్తే రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. రైతుల రుణ మాఫీలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.