సీబీఎస్ఈ పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష ఇక లేనట్టే!

SMTV Desk 2018-04-03 17:30:12  cbse, 10th class, maths, exam, not reconducted

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కాస్తంత ఊరట లభించింది. పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను మరోసారి నిర్వహించే అవకాశాల్లేవని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఎకనమిక్స్ పేపర్ ను ఈ నెల 25న తిరిగి నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటన కూడా జారీ చేసింది. మ్యాథ్స్ పరీక్షను తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్టు మానవవనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.