ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి

SMTV Desk 2018-04-03 17:19:14   Encounter, maoists, Gadchirol iPolice, maoists killed

గడ్చిరోలి, ఏప్రిల్ 3: మహారాష్ట్ర పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన నక్సలైట్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కాగా ఇటీవల ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇది జరిగిన ఐదు రోజులకే తాజా ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.