న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 17 హెలికాప్టర్ ఈరోజు ఉదయం కుప్పకూలి౦ది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సమీపంలో హెలీకాప్టర్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కేదార్నాథ్ సమీపంలోని హెలిప్యాడ్లో మిగ్ 17ను ల్యాండ్ చేస్తుండగా ఐరన్ గిడ్డర్కు తగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పైలట్ సహా హెలికాప్టర్లో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.