న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా శాఖాలను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నిర్ణయించింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్ఆర్డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, హేమ్వతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, మణిపూర్ యూనివర్సిటీల్లో కొత్తగా ఆరు యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతి లభించిందని సత్యపాల్ చెప్పారు.