ఐపీఎల్‌ వేడుకలకు దూరమైనా రణ్‌వీర్‌ సింగ్‌

SMTV Desk 2018-04-02 16:01:00  ranveer singh, ipl-11 starting ceremony, bolly wood hero ranveer singh, chennai super kings,

ముంబై, ఏప్రిల్ 2: ఈ ఏడాది ఐపీఎల్-11 సీజన్ ప్రారంభవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ తొలుత పాల్గోనున్నట్లు విషయం తెలిసిందే. ముంబయిలోని వాంఖడే మైదానంలో నిర్వాహకులు ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం రణ్‌వీర్‌ ప్రదర్శన రద్దైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతూ రణ్‌వీర్‌ గాయపడ్డాడు. భుజానికి స్వల్ప గాయమైంది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ కారణంగానే అతడు ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు దూరమయ్యాడు. వరుణ్‌ ధావన్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, పరిణీతి చోప్రా తదితరులు ఈ ఏడాది ఐపీఎల్‌ వేడుకల్లో అలరించనున్నారు. లీగ్ లో భాగంగా ఏప్రిల్ 7న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.