అరుణ్ జైట్లీకి క్షమాపణ లేఖ రాసిన కేజ్రీవాల్

SMTV Desk 2018-04-02 15:57:54  kejrival sorry to arunjetli,

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని గతంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ విషయంపై మండిపడ్డ జైట్లీ.. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో జైట్లీని ఉద్దేశించి ఈ మేరకు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. 2015 డిసెంబర్‌లో కొందరు వ్యక్తులు తనకు కొన్ని పత్రాలు అందించారని, వాటిని ఆధారంగా చేసుకునే తాను జైట్లీపై ఆరోపణలు చేశానని చెప్పారు.